30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జాగృతి యువజన విభాగం నాయకుడు రెహాన్ ఆధ్వర్యంలో సారంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 300 మందికి స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు. గత పదేళ్లుగా కవిత జన్మదిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రెహాన్ తెలిపారు. జాగృతి నాయకులు అవం తిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్ ఘనపురం దేవేందర్, ఆమేర్, ఇస్మాయీల్, శ్యామల సాయి కృష్ణ, పంచరెడ్డి మురళి, హరీశ్, శోభవతి, సరిత, సందీప్, ఆకాశ్, శ్రీకాంత్, సంజీవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Distribution of school bags under the auspices of Jagruti Youth Department

More articles

Latest article