24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి వంట సామాగ్రి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన పుల్ల మానెమ్మ అనే బాధిత మహిళ కుటుంబానికి సోమవారం ఎల్లారెడ్డి జీవదాన్ హాస్పిటల్ వైద్యులు వంట సామాగ్రి తో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత రెండు రోజుల క్రితం పుల్ల మానెమ్మ కు చెందిన నివాసపు పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై 8 లక్షల ఆస్తి నష్టం జరగడంతో విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి జీవదాన్ హాస్పిటల్ వైద్య బృందం సభ్యులు పుల్ల మానెమ్మ కుటుంబానికి బియ్యం, బట్టలు, వంట సామాగ్రి తో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపేట మండల కోఆర్డినేటర్ వి. నరసింహారెడ్డి మానెమ్మ కుటుంబానికి 25 కిలోల బియ్యం తో పాటు బట్టలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, లక్ష్మణ్ ఠాగూర్, సాయ గౌడ్, మన్నె వెంకటి, హన్మండ్లు, బలరాం తదితరులు ఉన్నారు.

More articles

Latest article