కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు పి. మేఘవర్ణ తల్లి కొమ్ము రమ్య జ్ఞాపకార్థం, 20 మంది బీదవాళ్లకు ఆర్టిఐ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఎం.పీ.డీ.వో. పూర్ణ చంద్రోదయ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దానగుణం అందరూ అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరు దయాగుణం కలిగి ఉండాలని దుప్పట్లు పంపిణీ చేసిన ఉపాధ్యాయురా లును అభినందించారు. ఆర్టిఐ మండల అధ్యక్షులు నాంపల్లి.మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల, సమాజంలో మనుషుల విలువ పెరుగుతాయని, అన్నారు. ఈకార్యక్రమంలో.ఈ.వో. రమేష్. హెచ్. ఎంరామేశ్వర్ రెడ్డి. ఆర్టిఐ కార్యదర్శి’ పండ్ల హనుమంతు. జిపి కారోబార్ సిద్ధరాములు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
