హైదరాబాద్, బతుకమ్మ : ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం రాత్రి కన్నుమూసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. గోపీ చంద్ హీరోగా నటించిన ’యజ్ఞం‘ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. బాలకృష్ణ తో ’వీరభద్ర‘, సాయి దుర్గాతేజ్ తో ’పిల్లా నువ్వు లేని జీవితం‘ సినిమాలను తెరకెక్కించారు. ఆయన మృతి పై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
