27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దాడిని ఖండిస్తూ ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ లో ఇటీవలే ఒక వర్గంను టార్గెట్ చేస్తూ ఒక వర్గానికి చెందిన 40 మంది కలిసి ప్లాన్ ప్రకారం వాహనానికి బైక్ అడ్డం పెట్టి అడ్డుకొని ఇనుప రాడ్డుతో కర్రలతో ఒంటరిగా ఉన్న వ్యక్తిని నడి రోడ్డుపై దాడి చేసి చితకభాది అతని పై బుల్లెట్ బైక్ ని నడిపించి కాలు విరగ కొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ సోమవారం మోర్తాడ్ మండలంలోని జాతీయ రహదారిపై మోర్తాడ్ లోని అన్ని కుల సంఘాల సభ్యులు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ఈ దాడికి పాల్పడ్డ వారిలో 40 మంది దాడి చేస్తే కేవలం ఆరు గురిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేయడం పోలీస్ యత్రాంగం నిర్లక్షానికి స్పష్టం అవుతుందని ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం, సిగ్గుచేటు విషయం అని తెలిపారు. కావున తక్షణమే బాధితునికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. లేని యెడల ఎలాంటి న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Dharna condemning the attack

More articles

Latest article