ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండల కేంద్రం లో శనివారం ఎక్సైజ్ సీఐ అంజత్ రెడ్డి కి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కి గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. సీఐ గ్రామ కమిటీ సభ్యులపై దురుసుగా మాట్లాడినందుకు ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ధర్నా వలన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
