నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ నగరం శివాజీనగర్ కు చెందిన ధర్మారం అవిన్ తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు. గురువారం తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో టూరిజం ప్లాజా హోటల్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లాను ప్రోత్సహిస్తూ , జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ విజ్ఞప్తి మేరకు గత పది సంవత్సరాలుగా జాతి కోసం పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా వాసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మారం అవిన్ ని రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇటుక రాజు మాదిగ నియమిక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జ్ ఇటుక గోపి మాదిగ , నిజామాబాద్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అఖిల్ మాదిగ టిఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

