24 C
Hyderabad
Sunday, August 2, 2026

ట్రాన్స్ఫార్మర్స్ ధ్వసం… ఆయిల్ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం లో దొంగలు బాసర రహదారి కి ప్రక్కన గల రెండు ట్రాన్స్ఫార్మర్స్ లను ద్వంసం చేసి ఆయిల్ ను చోరీ చేశారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు మండల కేంద్రంలో అయ్యప్ప గుడి సమీపంలో బాసర రహదారి ప్రక్కన గల 100 కేవీ ట్రాన్స్ఫార్మర్స్, నాగేపూర్ శివారు లో 40 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేసి ఆయిల్ చోరీ చేశారని పోలీసులు తెలిపారు. విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నవీపేట్ ఎస్సై తెలిపారు.

Destruction of transformers... oil theft

 

More articles

Latest article