27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ : రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్  గురువారం ఏసీబీకి చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం కోసం గతంతో రైతుల నుంచి భూమి సేకరించారు. ఇందుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. పరిహారం చెక్కులు మంజూరు చేసేందుకు నిమ్జ్​ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్​ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​ సతీశ్​ లంచం డిమాండ్​ చేశారు. ఓ రైతుకు మంజూరైన రూ.52,87,500 చెక్కును అందజేసేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు డిప్యూటీ కలెక్టర్​ రాజారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్​ సతీశ్​, డ్రైవర్​ దుర్గయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

More articles

Latest article