విజయవాడ,బతుకమ్మ: మొంథా తుఫాన్ ఎఫెక్టు కారణంగా అప్రమత్తమైన అధికారులు విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. తుఫాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని ఈవో ఆదేశించారు. కనకదుర్గానగర్, లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.
