డిల్లీ, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గాంలో జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈమీటింగ్ లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షిద్, అంబికా సోనీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా పహల్ గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.