నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు తిరుమలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాట్య తరంగిణి నృత్య అకాడమీ గురువులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. చిన్నారులను, గురువు శ్రీనివాస్ ను ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య స్వామి ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, భాస్కర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

