
. కార్తీక చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభుని గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రవీందర్ గుప్తా తెలిపారు.

