మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన మోర్తాడ్ మాజీ జడ్పీటీసి బద్దం రవి తండ్రిని ఆదివారం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల పాము కాటుకు గురి కావడంతో విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లి పరామర్శించి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
