బతుకమ్మ, మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అమెరికా పర్యటన ముగించుకొని గురువారం జుక్కల్ నియోజకవర్గం లోని క్యాంప్ కార్యాలయంలకు వచ్చారు. మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జుక్కల్ నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కు కలిసి పూలమాలవేసి ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అమెరికాలో రాహుల్ గాంధీతో కలిసి దిగిన ఫోటోని ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం ముఖ్య నాయకులు సాయిలు, ప్రజ్ఞ కుమార్, సాయి పటేల్, విట్టల్ గురూజీ,అమూల్, హన్మండ్లు, రమేష్, బాలు, తదితరులు పాల్గొన్నారు.
