హైదరాబాద్, బతుకమ్మ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దయాకర్ గౌడ్, టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ మెంబర్ జివి.రామక్రిష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన శ్యామ్ బాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ త్వరగా లీగల్ ఇష్యూని కార్పొరేషన్ పరిధిలో పరిష్కరించాలని,కేసులను త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వo తరుపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

