రుద్రూర్, బతుకమ్మ :
బీహార్ రాష్ట్రంలో భరత్ తివారి అనే సామాజిక కార్యకర్తపై అన్యాయంగా జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ చౌక్ వద్ద బుధవారం రాత్రి కొవ్వుత్తులను ప్రదర్శిస్తూ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
