- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రుద్రూర్, బతుకమ్మ : యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా రుద్రూర్ గ్రామానికి చెందిన యోగ గురువు డా.విశ్వనాధ్ మహాజన్ కు ఆదివారం కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. క్లసికల్ గార్డెన్ పారడైస్ , సికింద్రాబాద్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విశేష సేవలు అందించినందుకు ఆయనకు సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు యోగ చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
