నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ మంద మకరంధ్ సోమవారం డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. నాగారంలోని బల్ధియా డంపింగ్ యార్డను తనిఖీ చేసి అక్కడ చేత్త సేకరణ తరువాత జరిగే కార్యకలపాలను పరిశీలించారు. డంపింగ్ యార్డులో తడి చేత్త, పోడి చేత్త వేరు చేసే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. త్వరలో సిడియంఏ అధికారులు పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రతగా తనిఖీ చేసినట్లు తెలిసింది. కోట్లు ఖర్చు పెట్టి చేసిన యూనిట్ సంవత్సరాల తరబడి మూలన పడి ఉండటంతో వాటి పరిశీలనకు ఉన్నతాదికారులు రానుండటంతో మళ్లి కార్యకలపాలు ప్రారంభించాలని అదేశించినట్లు తెలిసింది. కమీషనర్ వేంట సానిటరీ ఇన్స్ పేక్టర్లు ఉన్నారు.

