. . . క్రిడలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి
నిజామాబాద్ స్పోర్ట్స్ , బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల రాజరాం స్టేడియంలో భారత్ రత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మెమోరియల్ అథ్లెటిక్స్ 2024 ప్రారంభమయ్యాయి. కైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 9 వ భారత్ రత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మెమోరియల్ అథ్లెటిక్స్ 2024 ను ఆదివారం ఉదయం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ బాధ్యులు బాగారెడ్డి, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి , డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ , కాలూరు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న , రాజేందర్ తోపాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

