నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కేంద్ర గ్రంథాలయం శిధిలాభివస్థలో ఉన్నందున నూతన భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు కావడంతో భవనం శిథిలావస్థకు చేరిందని, భవనం పెచ్చులు ఊడటం వర్షాలు పడటంవల్ల నీరు రావడం జరుగుతుందని సరియైన బాత్రూంలు, పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురి అవుతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు..