25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పెగడపల్లి పీఎసీఎస్‌ ఎరువుల గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఎసీఎస్) లో నిల్వ ఉన్న ఎరువుల నిల్వలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు రైతులకు సరిపడేంత ఎరువులు అందుబాటులో ఉన్నాయా? యూరియా సరైన మోతాదులో లభిస్తున్నదా? అనే విషయాలను అక్కడే రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ విడిసి చైర్మన్ మేడి రవి, రైతులు చిన్నారెడ్డి, బీరయ్య, ఆడెళ్లి యాసిన్, రసూల్, పోశెట్టి, సాయిలు, గంగాధర్, అనిల్ తో పాటు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

Collector inspects Pegadapalle PACS fertilizer godown

More articles

Latest article