28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్ :-వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ రైతులు ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల మాఫీ చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి కి క్షీరాభిషేకం చేశారు.అనంతరం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాలతో ఆసుపత్రిలలో చికిత్స పొందిన లబ్ధిదారులు గోర్తే వసంతకు 42 వేల,నల్లవెల్లి వంశీ కి 40 వేల, రాజ వేణి పోషన్న కు 26 వేల, బోండ్ల సాయన్న కు 22 వేల ఆర్థిక సాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, గట్టు అవతల నర్సారెడ్డి, గడ్డల నర్సయ్య, చక్రపాణి, నెహ్రు, సిహెచ్ మోహన్, హలీం, కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులు రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article