26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్ల మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అప్పటి వరకు తెరిచి ఉన్న 5 గేట్లను మూసివేశారు. ప్రాజెక్టులో 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో 26 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లను మూసివేశారు. ఈ నెల 7న రాత్రి 11 గంటల ప్రాంతంలో 8 గేట్లను తెరిచిన అధికారులు ఇన్ ఫ్లో ఆధారంగా ఆదివారం 24 గేట్లను తెరిచి లక్ష క్యూసెక్కులను విడుదల చేశారు. మళ్ళీ ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం ఉదయం నుంచి నీటి విడుదలను తగ్గిస్తూ వస్తు గేట్లను మూసివేశారు.

More articles

Latest article