ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోమన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని వీకేవీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి క్రైస్తవులకు చాలా సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు. ప్రతి యేటా ఇలా క్రిస్మస్ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం చాలా ఆనందదాయకం అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

