- తహసీల్దార్ రమేష్
ఆర్మూర్, బతుకమ్మ : న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా,ఎలాంటి వివాదాలు తలెత్తకుండా జరుపుకోవాలని ఆలూర్ మండల తాసిల్దార్ రమేష్ సూచించారు. ప్రత్యేకించి యువత మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాల పాలై కుటుంబ సభ్యులకు ఇబ్బందులు చేయించవద్దని ఆయన ఆలూర్ మండల ప్రజలను కోరారు.