జగ్గయ్యపేట, బతుకమ్మ : ఏపీలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూలీలపైకి ఓ కారు దూసుకెళ్లింది. చెరువు బజార్ లో కూలీలు రోడ్డుపై నిలబడి ఉండగా వేగంగా వచ్చిన కారు కూలీలను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
