హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కేసు ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్లినట్లే. ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సెప్టెంబర్ 1న సీబీఐ డైరెక్టర్ కు, కేంద్ర హోంశాఖకు నోటిఫికేషన్ కూడా పంపించారు. అయితే తాజాగా ప్రవీణ్ సూద్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
