డీజే నిర్వాహకులపై కేసు నమోదు

0 5,116

నందిపేట, బతుకమ్మ : పరిమితికి మించి డీజే సౌండ్ పెట్టడంతో డీజే నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ  శ్రీధర్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..  నందిపేట మండలం  ఐలాపూర్ లో మంగళవారం రాత్రి పరిమితికి మించి డీజే సౌండ్ పెట్టి  ప్రజల ఇబ్బందులకు కారణమైన డీజే నిర్వహకులపై,  గణేశ్ మండలి ఆర్గనైజర్ల పై కేసు నమోదు చేశారు. రెండు డీజేలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.  భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.

 Case registered against DJ's managers

Leave A Reply

Your email address will not be published.