27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వాగులోకి దూసుకెళ్లిన కారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  బాలు చందర్ (22) అనే యువకుడు  ఆదివారం రాత్రి డీజే ప్రోగ్రాంకి వెళ్లి వస్తుండగా  ప్రమాదవశాత్తు వాగులోకి కారు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో అతను మృతి చెందాడు. రాత్రి సమయంలో ఎవరు చూడకపోవడంతో,  సోమవారం ఉదయం కాలకృత్యలకు వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేసీబీ సహాయంతో కారును పోలీసులు బయటకు తీశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్పల్లి సీఐ భిక్షపతి తెలిపారు. బాలుచందర్ పై  మృతిపై స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Car plunges into ravine

 

 

More articles

Latest article