. తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం
ఆర్మూర్, బతుకమ్మ: మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ బస్టాండ్ వద్ద సోమవారం తెల్లవారుజామున కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు కారు బైకు ఢీకొనగా, పెర్కిట్ కి చెందిన సుద్దపల్లి గంగాధర్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

