నిజామాబాద్, బతుకమ్మ : అంబేడ్కర్ జయంతి సందర్భంగా ధన్ పాల్ లక్ష్మిభాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా ట్రస్ట్ బాధ్యులు ధన్ పాల్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతు ప్రజలందరికి హక్కులను కల్పించిన మహనీయులు అంబేడ్కర్ అని కొనియాడారు. నేటి యువత మహనీయుల జయంతి, వర్ధంతులు జరుపడానికే పరిమితం కాకుండా, అంబేడ్కర్ ఆశయసాధనకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
