బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారని మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మండల కేంద్రంలోని ఆరటి వినయ్ ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారం 10 తులాల వెండి పట్టేగొలుసు దొంగిలించినట్లు ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఎస్సై తెలియజేశారు.
