నిజామాబాద్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్ టీయూ తరపున పోటీ చేస్తున్న వంగ మహేంధర్ రెడ్డికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. పీఆర్ టీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చైతన్య తమ సంపూర్ణ మద్దతు మహేంధర్ రెడ్డికి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రమోషన్లలో అడ్డంకిగా ఉన్న అడ్వకసిని తొలగించడానికి తోడ్పాటు అందిస్తామని తెలుపడంతో తమ బహుజన టీచర్స్ ఫెడరేషన్ మహేంధర్ రెడ్డి గెలుపునకు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి కిషన్, బీటీఎఫ్ అధ్యక్షులు సాయి, ప్రధాన కార్యదర్శి స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
