బిచ్కుంద, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని వాజిద్ నగర్ గ్రామంలో పెద్ద దేవాడ బిఆర్ఎస్ అభ్యర్థి కుంటివార్ సునీత సాయిలు, సిర్సముందర్ గ్రామ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ లు గ్రామ మాజీ సర్పంచ్ శివానంద్ అప్ప,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్ ఆధ్వర్యంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే బలపరిచిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధి కొరకు భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలు ధీమ వ్యక్తం చేశారు.
