హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫొన్ కాల్ కలకలం రేపింది. మూడు రోజుల నుంచి గుర్తు తెలియని దుండగుడు ఫొన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సచివాలయంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని తేల్చింది. దుండగుడు ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.