నందిపేట, బతుకమ్మ: రెహమానియా మస్జిద్ మాజీ అధ్యక్షుడు రియాజ్ ఆద్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో రెడ్క్రాస్ సొసైటీ, సుఖీభవ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి కుల మత భేదాలు లేకుండా యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలు నిలుపుకోవచ్చని ఆయన తెలిపారు.
