27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీజేపీ విజయోత్సవ సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట, బతుకమ్మ: ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచిన  సందర్భంగా  నందిపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు  శనివారం విజయ సంబరాలు  జరుపుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని  శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని, త్వరలోనే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నాగ సురేష్, మండల సీనియర్ నాయకులు సూది సాయికుమార్, గాండ్ల నర్సాగౌడ్, వెల్మన్ నరేందర్, గడ్డం చిన్నారెడ్డి, వడ్ల భోజన్న, దమ్మాయి సుధాకర్, అబ్బి గంగారం, పుల్లూరి గంగాధర్ గౌడ్, షాపూర్ కృష్ణ, ఐలాపూర్ రమేష్, మంగళారపు నవీన్, నాలేశ్వర్ గంగాధర్, నాగ తారక్, కస్తూరి గంగాధర్, గద్దె రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article