ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో రోడ్డు ప్రమాదంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన హర్షద్ రిజ్వాన్ కాలు విరిగి అశ్విని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. తనతోపాటు మాజీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు చల్ల సత్యం రెడ్డి, నంది నరేష్, కిరణ్ నాయక్, దాసరి గణేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
