బతుకమ్మ, వేల్పూర్:- మండలం లోని పచ్చల నడుకుడ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని అన్నారు. గ్రామంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క యూత్ సభ్యులు సహకరించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,వివిధ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.