డిప్యూటీ డీఎంహెచ్ వో సమత
రుద్రూరు పీహెచ్ సీ తనిఖీ
రుద్రూర్, బతుకమ్మ : ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ వో సమత సిబ్బందికి సూచించారు. రుద్రూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డా.సమత ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ డా. అయోషా సిద్ధికా, ఆస్పత్రి సిబ్బంది తదితరులున్నారు.
