26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇళ్లు నిర్మిచుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి 

 

పాల్వంచ, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని గృహాలను నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి  పాల్వంచ మండలం లోని ఇస్సాయిపేట్, పాల్వంచ గ్రామాలలో మరియు మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామంలోని వివిధ నిర్మాణదశలలో  నిర్మాణంలో ఉన్న ఇండ్లను పర్యటించి లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమునకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించినారు మరియు వారి యొక్క సందేహములను నివృత్తి పరిచారు. ఇట్టి కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు స్వయంగా స్టేజి ఫోటోలను అప్లోడ్ చేయు వివరములను మరియు లబ్ధిదారులు ఏదైనా వివరములు మరియు సమస్యలు విన్నవించుటకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005995991 గూర్చి వివరించడం జరిగింది. ఇట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమునకు సంబంధించి అవసరమగు  ఇసుకను ప్రభుత్వం సంబంధిత మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులు ట్రాక్టర్ కిరాయి,లేబర్ ఏర్పాటు చేసుకొని ఉచితంగా సరఫరా చేయబడుటకు వివరములను తెలియజేసినారు. ఇట్టి గృహ నిర్మాణములకు సంబంధించి ఎవరికిని ఎలాంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇవ్వకూడదని తెలియజేయడం జరిగినది. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఇందిరమ్మ వెబ్సైట్లో స్వయంగా తెలుసుకోవచ్చునని ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వ వెబ్సైట్ గురించి తెలియజేసినారు. ఇట్టి పర్యటనలో భాగంగా పాల్వంచ మండలములో నిర్మించినటువంటి నమూనా గృహమును సందర్శించి లబ్ధిదారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తక్కువ ఖర్చుతో దృఢంగా ఇంటి నిర్మాణం చేసుకొనుటకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో వై సుభాష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హౌసింగ్), ఎం శ్రీనివాస్ ఏ ఈ (హౌసింగ్), ఎంపీడీవో లు పాల్వంచ మాచారెడ్డి, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Beneficiaries should be encouraged to build houses.

More articles

Latest article