నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సెంటర్ నాందేవాడలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సభ్యులు దీపిక, కళ, స్వప్న, పద్మ, లావణ్య, లక్ష్మి, గంగమని, పాపవ్వ, సాయవ్వ, మీరాబాయి, బుధమ్మ, పోసాని, డి.లక్ష్మి పాల్గొన్నారు.

