నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గోవర్ధన్ ను నిజామాబాద్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, డీసీఈబీ సెక్రటరీ బి. శీతయ్, జిల్లా గౌరవ అధ్యక్షులు జె. గంగయ్య, మౌలానా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆంజనేయులు, ఎస్సీ ఎస్టీ సెల్ కన్వినర్ డా. అజయ్, ఫిజిక్స్ ఫాకల్టీ లింబంద్రీ, ఆనంద్ పాల్గొన్నారు.

