బతుకమ్మ, మోర్తాడ్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మోర్తాడ్ మండల ప్రెసిడెంట్ అంగులి మాల అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సందీప్ కుమార్, మార్వాడి సురేష్, శశికాంత్, నవీన్, అనంతరావు, సాగర్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
