నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రాం జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ( ఎ. ఆర్ ) ఎ. రామచంద్ర రావు మాట్లాడుతూ దేశానికి బాబూ జగ్జీవన్ రాం చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యాక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ తిరుపతి (అడ్మిన్), శ్రీనివాస్ (వెల్ఫేర్), శేఖర్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్ బషీర్, సి.సి.ఆర్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది హోం గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.
