బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో వైశ్య ఫంక్షన్ హాల్ లో మంగళవారం డి.ఎస్.పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దోమకొండ, రాజంపేట, భిక్కనూరు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మై ఆటో ఈజ్ సేఫ్ అనే అంశంపై ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటోను మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కాగితాలు కచ్చితంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ ఎస్సై సాయికుమార్ పోలీసులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
