25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పిడి నరసింహారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఎర్త్ వాలంటీర్స్ గా నియమించి బాధ్యతలు అప్పగించడం జరిగింది . ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు పాఠశాలలో అతి పెద్ద వృక్షమైన సుమారు 70 సంవత్సరముల మామిడి చెట్టును పూజించడం గర్వకారణం అన్నారు పర్యావరణం గురించి వృక్షాల యొక్క ఆవశ్యకత గురించి పిల్లలకు ఉపన్యాసాల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మండల విద్యాధికారి రాజ్ గంగారెడ్డి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article