నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో బెల్టు షాప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సింధూశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో సారంగాపూర్ గ్రామంలో ప్రణయ్ గౌడ్ బెల్టుషాప్ (మినీ బార్) పై దాడి చేశారు. ఈ దాడిలో 58 బీర్లు, మద్యం బాటిళ్లు, స్వాధీనం చేసుకున్నారు. నగదు రూ.18,590 స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ప్రణయ్ గౌడ్ తో పాటు మద్యంను అరవ టౌన్ పోలీసులకు అప్పగించారు.