ఏటీఎంలో చోరీకి యత్నం

0 1,262

ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండలం కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. అటుగా వస్తున పెట్రోలింగ్ పోలీసులను చూసి దొంగలు పారిపోయారు. ఏటీఎం సెంటర్లో ఎటువంటి నగదు చోరీకి గురికాలేదు. బుధవారం బ్యాంక్ మేనేజర్ సుశీల్ కుమార్ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యుదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.